టీడీపీలోకి వైసీపీ కార్యకర్తల చేరిక

ABN , First Publish Date - 2022-05-17T06:10:42+05:30 IST

మండలంలోని బొట్లపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు సోమవారం టీడీపీలో చేరారు.

టీడీపీలోకి వైసీపీ కార్యకర్తల చేరిక
పమిడి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

దర్శి, మే 16 : మండలంలోని బొట్లపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు  వైసీపీ కార్యకర్తలు సోమవారం టీడీపీలో చేరారు. వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా ఆదివారం రాత్రి టీడీపీ నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.  పమిడి రమేష్‌ సమక్షంలో బొట్లపాలెం ఎస్సీ కాలనీకి చెందిన  వైసీపీ కార్యకర్తలు జి. ఇశ్రాయేలు, జి.పౌలు, ఎం.బాలఅచ్చయ్య, శ్యాంసన్‌ టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పమిడి రమేష్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. వైసీపీ పాలకుల అరాచకాలు తట్టుకోలేక టీడీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, దర్శి నగర పంచాయితీ చైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, బొట్లపాలెం మా జీ సర్పంచ్‌ శాగం అంజిరెడ్డి పాల్గొన్నారు. అంతకముందు సామంతపూడి పంచాయ తీలోని సీతారామపురంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంకు ప మిడి రమేష్‌ రూ.25వేల విరాళం అందజేశారు. 


Updated Date - 2022-05-17T06:10:42+05:30 IST