ప్రేమ జంట బలవన్మరణం!

ABN , First Publish Date - 2021-06-11T09:44:22+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరిపించింది. దీంతో ఆ యువతి.. ప్రియుడితో కలిసి

ప్రేమ జంట బలవన్మరణం!

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన.. 25 రోజుల తర్వాత వెలుగులోకి


వర్ని(చందూరు), జూన్‌ 10 : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరిపించింది. దీంతో ఆ యువతి.. ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది జరిగిన 25 రోజుల అనంతరం వారిద్దరూ విగతజీవులై... శరీరాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్‌ జిల్లా చందూరు మండలం లక్ష్మాపూర్‌ శివారులో గురువారం వెలుగులోకి వచ్చింది. మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన పెద్దిగారి మోహన్‌ (19), ఇదే గ్రామానికి చెందిన మల్లె లక్ష్మి (19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న లక్ష్మి తల్లి పోచవ్వ ఆరు నెలల క్రితమే వేరే యువకుడితో లక్ష్మికి పెళ్లి జరిపించింది. అయితే, లక్ష్మి మే 14న మోహన్‌తో కలిసి అత్తింటి నుంచి పారిపోయింది. చివరకు గురువారం లక్ష్మాపూర్‌ అటవీప్రాంతంలో ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు.

Updated Date - 2021-06-11T09:44:22+05:30 IST