Andhra Jyoti Siddipet జిల్లా యాడ్స్‌ ఇన్‌చార్జి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-09-08T12:49:32+05:30 IST

ఆంధ్రజ్యోతి(AndhraJyoti)సిద్దిపేట (Siddipet) జిల్లా ప్రకటనల విభాగం ఇన్‌చార్జి దుర్గాప్రసాద్‌Incharge Durgaprasad

Andhra Jyoti Siddipet జిల్లా యాడ్స్‌ ఇన్‌చార్జి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం

Siddipet: ఆంధ్రజ్యోతి(Andhra Jyoti)సిద్దిపేట (Siddipet)  జిల్లా ప్రకటనల విభాగం ఇన్‌చార్జి దుర్గాప్రసాద్‌(Incharge Durgaprasad) బుధవారం తెల్లవారుజామున సిద్దిపేట పట్టణంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు గతంలో గుండెనొప్పి రావడంతో బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. కాగా బుధవారం తెల్లవారుజామున గుండెలో నొప్పిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించినట్లు కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు. దుర్గాప్రసాద్‌ భౌతికకాయానికి మంత్రి హరీశ్‌రావు, ఆంధ్రజ్యోతి సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్‌ కుటుంబసభ్యులను మంత్రి హరీశ్‌రావు ఓదార్చి, అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆంధ్రజ్యోతి ప్రకటనల విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, డీజీఎం సురేష్‌, ఏజీఎం రమణారావు, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఆంధ్రజ్యోతి ఉమ్మడి మెదక్‌ జిల్లాల పాత్రికేయులు, తదితరులు దుర్గాప్రసాద్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Updated Date - 2022-09-08T12:49:32+05:30 IST