నృసింహ జయంత్యుత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-05-14T02:34:35+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుక్రవారం సంప్రదాయరీతిలో శ్రీకారం చుట్టారు.

నృసింహ జయంత్యుత్సవాలకు శ్రీకారం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుక్రవారం సంప్రదాయరీతిలో శ్రీకారం చుట్టారు. ఆలయ ఉద్ఘాటన పర్వాల అనంతరం ప్రధానాలయంలో స్వయంభువుడు పాంచ నారసింహుడి జయంతి వేడుకలు తొలిసారిగా నిర్వహిస్తున్నారు. వేకువజామున స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా తిరువేంకటపతి నాథుడిగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో విశ్వక్సేనుడికి తొలిపూజలతో నృసింహ జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

Read more