నీటి పారుదల శాఖ ఈఈ కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-24T04:48:12+05:30 IST

పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ సముదాయ భవనంలో బుధవారం నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ది శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ప్రారంభించారు.

నీటి పారుదల శాఖ ఈఈ కార్యాలయం ప్రారంభం
నూతన కార్యాలయంలో ఈఈ రాములును సీట్లో కూర్చోబెడుతున్న ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌

హుస్నాబాద్‌, జూన్‌ 23: పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ సముదాయ భవనంలో బుధవారం నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ది శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ప్రారంభించారు. నీటిపారుదల శాఖ డివిజన్‌-4 ఇంజనీర్‌ కార్యాలయంలో ఈఈతో పాటు నలుగురు డీఈలు, 22 మంది ఏఈలు ఉంటారని ఆయన తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు హుస్నాబాద్‌, చిగురుమామిడి మండలాల్లోని చెరువులు, కుంటలు, కట్టు కాలువల అభివృద్ధి ఈ కార్యాలయ పరిధిలోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ రాజారెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ రాములు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఎంపీపీలు మానస, లక్ష్మీ, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు, ఎడబోయిన తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు సుప్రజ, వంగ వెంకట్రాంరెడ్డి, వాల నవీన్‌రావు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-06-24T04:48:12+05:30 IST