అనకాపల్లిలో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదా

ABN , First Publish Date - 2021-10-20T06:32:42+05:30 IST

అనకాపల్లిలో బుధవారం జరగాల్సిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది.

అనకాపల్లిలో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదా

అనకాపల్లి, అక్టోబరు 19: అనకాపల్లిలో బుధవారం జరగాల్సిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేతులమీదుగా 20వ తేదీ ఉదయం కార్యాలయాన్ని ప్రారంభింపజేయడానికి పార్టీ శ్రేణులు భారీఎత్తున ఏర్పాట్లు చేశాయి. లోకేశ్‌ పర్యటనను విజయవంతం చేయడానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యేలా నాయకులు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు పలుచోట్ల పార్టీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు టీడీపీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. దీంతో ్లఅనకాపల్లి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశామని నియోజకవర్గం అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు తెలిపారు.

Updated Date - 2021-10-20T06:32:42+05:30 IST