Telangana శాసనసభ, మండలిలో జాతీయ జెండాను ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-06-02T13:28:06+05:30 IST
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ అవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ అవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అటు శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta sukhendar reddy) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్,నవీన్ కుమార్, ఎల్ రమణ, దండే విఠల్, శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తము రెడ్డి, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.