వెటర్నరీ వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2021-06-24T05:45:46+05:30 IST

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో వెటర్నరీ వైద్యులపై పార్లమెంట్‌ సభ్యురాలు మేనకగాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు శోచనీయమని జిల్లా పశువైఽద్యాధికారి శ్రీనివాస్‌రావు అన్నారు.

వెటర్నరీ వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
హుజూర్‌నగర్‌లో నిరసన తెలుపుతున్న వెటర్నీ డాక్టర్లు

హుజూర్‌నగర్‌, జూన్‌ 23: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో వెటర్నరీ వైద్యులపై పార్లమెంట్‌ సభ్యురాలు మేనకగాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు శోచనీయమని జిల్లా పశువైఽద్యాధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధిగా ఉండి అసభ్య పదజాలంతో పశువైద్యులను, పశువైద్య వృ త్తిని దూషించడం బాధాకరమన్నారు. వెంటనే మేనకగాంధీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, పశువైద్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రూపకుమార్‌, సురేష్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, వీరారెడ్డి, రమేష్‌, శంకర్‌, ఉషారాణి, సుధాకర్‌, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:45:46+05:30 IST