కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న తల్లి.. ఈ ఘోరాన్ని ఆపండంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-05-20T01:15:25+05:30 IST

నవమాసాలు మోసి జన్మనిచ్చిన కొడుకునే ఆ తల్లి పెళ్లి చేసుకుంది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం స్థానికంగా చ

కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న తల్లి.. ఈ ఘోరాన్ని ఆపండంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.. అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన కొడుకునే ఆ తల్లి పెళ్లి చేసుకుంది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరాఖండ్‌లోని బాజ్పూర్‌కు చెందిన బాబ్లి, ఇంద్రారామ్ దంపతులకు సుమారు 11ఏళ్లక్రితం పెళ్లైంది. ఈ క్రమంలో వారికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. అయితే ఉన్నట్టుండి బాబ్లి కనిపించకుండాపోయింది. దీంతో ఇంద్రారామ్ చుట్టుపక్కల గాలించాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న రూ.20వేలు కూడా కనపడకుండా పోయాయి. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. బాబ్లి తన కన్న కొడుకును పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం జరిగిందనీ.. పిల్లలు పుట్టిన తర్వాత అతడు బాబ్లిని వదిలేసి వెళ్లిపోయాడని చెప్పాడు. 



ఈ క్రమంలో బాబ్లి తనను రెండో పెళ్లి చేసుకున్నట్టు పేర్కొన్నాడు. రెండో పెళ్లి తర్వాత మొదటి భర్తకు పుట్టిన పిల్లలను వదిలేసి.. తనతో వచ్చేసినట్టు తెలిపాడు. తాజాగా మొదటి భర్తతో కలసి జన్మనిచ్చిన పిల్లలోని పెద్ద కుమారుడు.. తరచూ తన ఇంటికి వస్తూ బాబ్లిని కలిసేవాడని వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు సొంత అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2022-05-20T01:15:25+05:30 IST