తల్లి చనిపోయిన మూడో రోజే కుమారుడు..

ABN , First Publish Date - 2021-05-13T06:09:28+05:30 IST

కొయ్యలగూడెం పట్టణంలో తల్లి మృతి చెందిన మూడో రోజే కుమారుడు(50) కరోనాతో మృతి చెందాడు.

తల్లి చనిపోయిన మూడో రోజే కుమారుడు..

కొయ్యలగూడెం, మే 12: కొయ్యలగూడెం పట్టణంలో తల్లి మృతి చెందిన మూడో రోజే కుమారుడు(50) కరోనాతో మృతి చెందాడు. కొయ్యలగూడెం పట్టణంలో తల్లి మృతి చెందిన మూడో రోజే కుమారుడు(50) కరోనాతో మృతి చెందాడు. తల్లి సోమవారం ఉదయం మృతి చెందగా కుమారుడు రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నత వైద్యం కోసం కాకినాడ వెళ్తూ బుధవారం ఉదయం మృతి చెందాడు. తల్లి మరణ వార్త తెలియకుండానే కుమారుడు మృతి చెందాడు. ఇతను పట్టణంలో సామిల్లు నిర్వహి స్తూ అందరితోనూ సౌమ్యంగా ఉండేవాడు. పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపాన్ని ప్రకటించారు.


Updated Date - 2021-05-13T06:09:28+05:30 IST