ఎస్కేయూ స్నాతకోత్సవ ఆహ్వానపత్రికలో వైసీపీ జెండా రంగులు

ABN , First Publish Date - 2021-04-21T06:30:24+05:30 IST

ఎస్కేయూ స్నాత కోత్స వ ఆహ్వానపత్రికలో వై సీపీ జెండా రంగులతో గీతలను ముద్రించడం పై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశా రు.

ఎస్కేయూ స్నాతకోత్సవ ఆహ్వానపత్రికలో   వైసీపీ జెండా రంగులు
వైసీపీ రంగుల లైనలతో ముద్రించిన ఆహ్వానపత్రిక

- నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులు

అనంతపురం, ఏప్రిల్‌20 : ఎస్కేయూ స్నాత కోత్స వ ఆహ్వానపత్రికలో వై సీపీ జెండా రంగులతో గీతలను ముద్రించడం పై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. దీంతో మంగళవా రం ఎస్కేయూ పరి పా లన భవనం ఎదుట ఏ బీవీపీ నాయకులు నిర సన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టేట్‌ యూనివర్శిటీస్‌ కన్వీనర్‌ చెన్న య్య మాట్లాడుతూ... రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన ప్రభుత్వ విద్యా సంస్థల్లో రాజకీయ పార్టీల జెండాలను ముద్రించడం సిగ్గుచేటన్నారు. పదవు లకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనాలోచిత చర్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. యూనివర్శిటీ వైసీపీ జాగీరు కాదన్నారు. కార్యక్ర మంలో శివకుమార్‌, హనుమంతు రెడ్డి, అరవింద్‌, ఆనంద్‌ రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-04-21T06:30:24+05:30 IST