ప్రతినాయకుడి పాత్రలో
ABN , First Publish Date - 2021-01-31T05:41:26+05:30 IST
తమిళ కథానాయకుడు శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ కలయికలో వచ్చిన ‘విన్నాయ్ టాంటి వరువాయా’ (తెలుగులో ‘ఏం మాయ చేశావే’) చిత్రం
తమిళ కథానాయకుడు శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ కలయికలో వచ్చిన ‘విన్నాయ్ టాంటి వరువాయా’ (తెలుగులో ‘ఏం మాయ చేశావే’) చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వారిద్దరి కలయికలో మరో రెండు చిత్రాలు వచ్చినా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు వీరిద్దరూ కథానాయకుడు, ప్రతి నాయకుడు పాత్రలతో నటులుగా పోటీపడబోతున్నారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శింబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘పథ్తు తల’. ఒబెలీ ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో గౌతమ్ మీనన్ దగ్గర శిష్యరికం చేశారు.
ఆ చనువుతోనే తన గురువును ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించేలా ఒప్పించగలిగారని సమాచారం. గౌతమ్ మీనన్ ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లాయ్యటిథాల్’, ‘పావ కథైగల్’ వెబ్సిరీస్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాంతో ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఆయన్ను తీసుకోవాలని భావించారట. ‘పథ్తు తల’లో శింబు గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తుండగా గౌతమ్ కార్తీక్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ. ఆర్. రె హమాన్ సంగీతం అందిస్తున్నారు.