జోగుళాంబ సన్నిధిలో అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌

ABN , First Publish Date - 2022-08-07T05:04:52+05:30 IST

అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి, బా లబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ డొబ్రియల్‌ దర్శించుకున్నారు.

జోగుళాంబ సన్నిధిలో   అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌
ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌కు స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకుడు

అలంపూరు, ఆగస్టు 6 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన  జోగుళాంబదేవి, బా లబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం  తెలంగాణ అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌  డొబ్రియల్‌ దర్శించుకున్నారు. అంతకుముందు వీరికి ఆలయ ప్రధాన అర్చ కుడు దిండిగల్‌ ఆనంద్‌శర్మ, సిబ్బంది  సాదరస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా వారు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. ద ర్శనం అనంతరం వారిని శేషవస్ర్తాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట కన్జర్వేటర్‌ మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ క్షితీజా, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల అటవీశాఖ అధికారి రామకృష్ణ, గద్వాల ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి దేవరాజ్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-07T05:04:52+05:30 IST