పెళ్లి వేదిక మీదకు దూసుకొచ్చి వరుడిని చెప్పుతో చితకబాదిన మహిళ.. ఇదేంటని నివ్వెరపోయిన వధువు.. చివరకు సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2021-12-14T18:58:39+05:30 IST

వధూవరులిద్దరూ పెళ్లి వేదిక మీద కూర్చుని ఉన్నారు. బంధువులు, స్నేహితులతో పెళ్లి మండపం అంతా సందడి సందడిగా ఉంది.

పెళ్లి వేదిక మీదకు దూసుకొచ్చి వరుడిని చెప్పుతో చితకబాదిన మహిళ.. ఇదేంటని నివ్వెరపోయిన వధువు.. చివరకు సీన్ రివర్స్..!

వధూవరులిద్దరూ పెళ్లి వేదిక మీద కూర్చుని ఉన్నారు. బంధువులు, స్నేహితులతో పెళ్లి మండపం అంతా సందడి సందడిగా ఉంది. ఇంతలో ఓ మహిళ పెళ్లి వేదిక మీదకు దూసుకొచ్చింది. కాలికి ఉన్న చెప్పు తీసి వరుడిని చితక్కొట్టింది. జుత్తు పట్టుకుని లాగి కిందకు తోసేసింది. ఎంత మంది ఆపడానికి ప్రయత్నించినా ఆమె ఆగలేదు. చివరకు శాంతించి అసలు విషయం చెప్పింది. తాను అతడి మొదటి భార్యనని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. దీంతో షాకైన వధువు అక్కణ్నుంచి నిష్క్రమించింది. 


బీహార్‌లోని భోజ్‌పూర్‌కు చెందిన సిర్మాన్ శర్మ అనే వ్యక్తికి సంగీతా కుమారి అనే యువతితో సోమవారం సాయంత్రం నాగర్ ప్రాంతంలో పెళ్లి జరుగుతోంది. వధువుతో కలిసి సిర్మాన్ పెళ్లి వేదిక మీద కూర్చున్నాడు. అక్కడకు హఠాత్తుగా వచ్చిన ఓ మహిళ వరుడిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. అందరి ముందు చెప్పుతో కొట్టింది. సిర్మాన్‌తో తనకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని చెప్పింది. 


బంధువుల ద్వారా విషయం తెలియడంతో వచ్చానని తెలిపింది. అసలు విషయం తెలియడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాకయ్యారు. అప్పటికప్పుడు పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లికి కట్నంగా ఇచ్చిన డబ్బులు, పెళ్లి కోసం తెచ్చిన సామాన్లు తీసుకుని రాత్రికి రాత్రే వెళ్లిపోయారు. 

Updated Date - 2021-12-14T18:58:39+05:30 IST