భద్రతా వైఫల్యం : రాష్ట్రపతితో పీఎం మోదీ భేటీ

ABN , First Publish Date - 2022-01-06T19:28:54+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్

భద్రతా వైఫల్యం : రాష్ట్రపతితో పీఎం మోదీ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. పంజాబ్‌లో బుధవారం తన పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై వివరించేందుకు ఆయన సమావేశమైనట్లు జాతీయ మీడియా చెప్తోంది. ప్రస్తుతం వీరిద్దరి సమావేశం కొనసాగుతోంది. 


ఇదిలావుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 


Updated Date - 2022-01-06T19:28:54+05:30 IST