ఆ పబ్లో ఉన్నది జాతీయ పార్టీల నేతల పిల్లలే : బాల్క సుమన్
ABN , First Publish Date - 2022-04-04T23:16:39+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాడిసన్ పబ్ ఘటనలో రెండు జాతీయ
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాడిసన్ పబ్ ఘటనలో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే ఉన్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. వారిలో ఒకరు రేవంత్ రెడ్డి మేనల్లుడని, మరొకరు పబ్ నిర్వాహకుడు బీజేపీ నాయకురాలి కుమారుడని ఆయన తెలిపారు. ఇంకా కొంతమంది నాయకుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నామని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరిని బొంద పెడుతాడో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ రివ్యూ చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్లో పేకాట క్లబ్లు గతంలో ఉన్నవి అంటే అవన్నీ కాంగ్రేస్ నేతలవేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసుల్లో దొరికే పిల్లలు ఎవరంటే కాంగ్రేస్, బీజేపీ నేతల పిల్లలేనని ఆయన అన్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరికి నీతులు చెప్తారో మరి అని ఆయన ఎద్దేవా చేశారు.