ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుంది: ఎస్పీ

ABN , First Publish Date - 2022-07-05T05:06:41+05:30 IST

ప్రజా సమస్యలు పరిష్క రించడంలో పోలీస్‌శాఖ చిత్త శుద్ధితో పని చేస్తుందని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అ న్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో   పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుంది: ఎస్పీ
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, జూలై4 : ప్రజా సమస్యలు పరిష్క రించడంలో పోలీస్‌శాఖ చిత్త శుద్ధితో పని చేస్తుందని  ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అ న్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పోలీసులు పని చేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సోమవారం పోలీస్‌ ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల సమస్యలను ఓపిగ్గా విన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబాలు, రక్తసంబంధీకుల మధ్య  జరిగే చిన్నపాటి గొడవలను పరిష్కరించుకోకుండా పోలీస్‌స్టేషన్‌ల వరకు రావడం సరికాదన్నారు. కుటుంబా లు కూర్చుని చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్‌స్టేషన్‌లకు వెళ్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై  ఆరా తీశారు. స్టేషన్‌లలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఫిర్యాదులపై విచారణ జరిపించాలని ఏఎస్పీ రాములును ఆదేశించారు.  

Updated Date - 2022-07-05T05:06:41+05:30 IST