15 ఏళ్ల కొడుకు, రెండో భార్యను ఇంట్లోనే ఉంచి పనిమీద సిటీకి వెళ్లిన భర్త.. రెండ్రోజుల తర్వాత తిరిగొస్తే గదిలో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-10-19T19:54:39+05:30 IST

అతడి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 15 ఏళ్ల కొడుకున్నాడు. ఓ రోజు ఆ భర్త కొడుకును

15 ఏళ్ల కొడుకు, రెండో భార్యను ఇంట్లోనే ఉంచి పనిమీద సిటీకి వెళ్లిన భర్త.. రెండ్రోజుల తర్వాత తిరిగొస్తే గదిలో షాకింగ్ సీన్..!

రాజస్థాన్: అతడి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 15 ఏళ్ల కొడుకున్నాడు. ఓ రోజు ఆ భర్త కొడుకును, భార్యను ఇంట్లోనే ఉంచి పనిమీద సిటీకి వెళ్లాడు. రెండ్రోజుల తర్వాత ఇంటికి వచ్చిన అతడికి భార్య కనిపించలేదు. గదిలోకి వెళ్లిన అతడు అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్‌లో జరిగింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..


తారాచంద్ కుమవత్‌ మొదటి భార్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. భార్య మరణం తర్వాత అతడు ఆమె సొంత చెల్లెలు సరోజని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య 15 ఏళ్ల కొడుకుతో కలిసి బీఆర్ ఖోఖర్ స్కూల్ సమీపంలోని ఇంట్లో ఉంటున్నారు. తారాచంద్ పాఠశాల సమీపంలో ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు రెండో భార్య, కొడుకుని ఇంట్లో ఉంచి సరుకుల కోసం ఢిల్లీకి వెళ్లాడు. రెండ్రోజుల తర్వాత మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన తారాచంద్‌కు భార్య కనిపించలేదు. 


గదిలోకి వెళ్లిన అతడికి రక్తపుమడుగులో పడివున్న భార్య మృతదేహం కనిపించింది. అది చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సవతి తల్లి, బాలుడి మధ్య సోమవారం రాత్రి వివాదం జరిగిందన్నారు. తారాచంద్ కొడుకు ఆగ్రహంతో 38 ఏళ్ల సరోజని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడని వెల్లడించారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

Updated Date - 2021-10-19T19:54:39+05:30 IST