ప్రకాశం జిల్లాలో.. 171 మంది ఎస్జీటీలకు నియామక ఉత్తర్వులు
ABN , First Publish Date - 2020-09-27T17:47:17+05:30 IST
జిల్లాలో డీఎస్సీ-2018లో సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎంపికైన 171 మందికి..
కౌన్సెలింగ్ నిర్వహించి అందజేసిన జేసీ-2, డీఈవో
ఒంగోలు: జిల్లాలో డీఎస్సీ-2018లో సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎంపికైన 171 మందికి శనివారం నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు. జాయింట్ కలెక్టర్-2 టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ కళాపరిషత్లో వారి కి తొలుత కౌన్సెలింగ్ నిర్వహించా రు. 185 పోస్టుల భర్తీకి అభ్యర్థుల ను ఎంపిక చేశారు. దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 11 మం ది అభ్యర్థుల సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి కాలేదు. మిగిలిన 174 మందిలో ముగ్గురు గైర్హాజరయ్యారు. ఒకరు మరణించగా మరో అభ్యర్థి ఇంకో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయారు.
వర్షం కారణంగా కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోయానని, ఆదివారం వచ్చి నియామక ఉత్తర్వులు తీసుకుంటానని ఒకరు కోరడంతో అందుకు అధికారులు అంగీకరించారు. మిగిలిన 171 మం దికి జాయింట్ కలెక్టర్ చేతన్, డీఈవో సుబ్బారావు నియామకపు ఉత్తర్వులను అందజేశారు. జడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్, ఉపవిద్యాధికారులు, ఎం. వెంకటేశ్వర్లు, సందానీబాషా పాల్గొన్నారు.