పోలీసుల అదుపులో..దుళ్ల ఘటన నిందితులు?

ABN , First Publish Date - 2020-02-20T09:21:10+05:30 IST

కడియం మండలం దుళ్ళలో గత నెల 22వ తేదీన ఓ ఇంటిపై పెట్రోలు పోసి నలుగురి ప్రాణాలు బలిగొన్న నిందితులను పోలీసులు

పోలీసుల అదుపులో..దుళ్ల ఘటన నిందితులు?

కడియం, ఫిబ్రవరి 19: 

 కడియం మండలం దుళ్ళలో గత నెల 22వ తేదీన ఓ ఇంటిపై పెట్రోలు పోసి నలుగురి ప్రాణాలు బలిగొన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేసి ముమ్మరంగా గాలించారు.  నిందితులు మాదాసు శ్రీను, మోహన్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. క్రైం సీన్‌ రీకనస్ట్రక్షన్‌లో భాగంగా నిందితులను కడియం తీసుకొచ్చారు. 

Updated Date - 2020-02-20T09:21:10+05:30 IST