ఫొటోలు చూసి యువతులను సెలెక్ట్ చేసుకోవాలట.. మనిషికో రేటు కట్టేశారు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే..
ABN , First Publish Date - 2022-01-09T23:27:48+05:30 IST
మధ్యప్రదేశ్లో ఓ ముఠా కొందరు యువతులు, మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అది కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే నిర్వహించడం.. అందరినీ షాక్కు గురి చేసింది...
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బు అవసరాలు ఉండడంతో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ చివరికి జైలు పాలవుతుంటారు. పేద యువతుల అవసరాలను ఆసరాగా తీసుకుని.. డబ్బు ఎర వేస్తూ చివరికి వారిని వ్యభిచారంలోకి దించే ఘటనలు ఇటీవల చాలా చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఓ ముఠా కొందరు యువతులు, మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అది కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే నిర్వహించడం.. అందరినీ షాక్కు గురి చేసింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్లోని పడవా పోలీస్ స్టేషన్ ఎదుట పాఠఖ్ పేరుతో ఉన్న గెస్ట్ హౌస్లో ఈ తంతు నిర్వహిస్తున్నారు. పార్టీలు, మీటింగ్ల పేరుతో ఏర్పాటు చేసిన ఈ గెస్ట్ హౌస్.. లోపల మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి.. ఎవరికీ అనుమానం రాలేదు. ఎక్కడెక్కడి నుంచే డబ్బు అవసరాలు ఉన్న యువతులు, మహిళలకు మాయ మాటలు చెప్పి.. వ్యభిచారంలోకి దింపుతున్నారు. అందం, వయసును బట్టి ఒక్కో రేటు పెట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెయ్యి రూపాయల నుంచి రూ.5వేల వరకు ఫిక్స్ చేశారని తేలింది.
లూడో గేమ్ వేదికగా.. రాజస్తానీ మహిళ, పాకిస్తాన్ యువకుడి ప్రేమాయణం.. భర్త, రెండేళ్ల బాబును వదిలి వెళ్తుండగా..
ఈ సెక్స్ రాకెట్ గురించి ఆనోటా ఈనోటా అందరికీ వ్యాపించడంతో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. చివరికి ఏకంగా జిల్లా ఎస్పీనే రంగంలోకి దిగారు. ఓ కానిస్టేబుల్ను మఫ్టీ డ్రెస్లో అక్కడికి పంపించారు. మొదట భయపడ్డ మేనేజర్.. చివరికి కొన్ని ఫొటోలను తెచ్చి చూపించాడు. తర్వాత కొంతమంది యువతులను పిలిపించాడు. కానిస్టేబుల్ సమాచారంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వ్యభిచారం నుంచి వచ్చిన ఆదాయంలో సగం యువతులకు, ఇంకో సగం నిర్వాహకుడికి అందుతుందని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.