‘కస్తూర్బా’లో మెనూ విధిగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-10-27T06:38:05+05:30 IST
మండలంలోని వేములపూడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాన్ని జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మంగళవారం సందర్శిం చారు.
జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ
నర్సీపట్నం అర్బన్, అక్టోబరు 26 : మండలంలోని వేములపూడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాన్ని జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ మంగళవారం సందర్శిం చారు. ‘బాలికల ఆకలి కేకలు’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురి తమైన కథనానికి ఆమె స్పందించి, ఈ మేరకు ఇక్కడకు విచ్చేశారు. తొలుత పాఠశాలలో అమలవుతున్న మెనూ, తరగతుల నిర్వహణపై విద్యార్థినులతో మాట్లాడారు. సరకుల స్టాకు వివరాలు తెలుసుకున్నారు. అంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులకు విధిగా మెనూ అమలు చేయాలన్నారు. విద్యా బోధన చక్కగా సాగాలని, విద్యార్థినులు కూడా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.