NRI దంపతులకు షాకింగ్ అనుభవం.. హాకీ స్టిక్‌తో దాడి చేసిన స్థానికులు.. కారణం ఏంటంటే!

ABN , First Publish Date - 2022-07-04T19:45:20+05:30 IST

ఎన్నారై దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. పెంపుడు శునకం కారణంగా దంపతులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాకీ స్టిక్‌తో ఇంటిపై దాడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అ

NRI దంపతులకు షాకింగ్ అనుభవం.. హాకీ స్టిక్‌తో దాడి చేసిన స్థానికులు.. కారణం ఏంటంటే!

ఎన్నారై డెస్క్: ఎన్నారై దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. పెంపుడు శునకం కారణంగా దంపతులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాకీ స్టిక్‌తో ఇంటిపై దాడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


జర్మనీకి చెందిన ఎన్నారై దంపతులు జైపూర్‌లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో గత కొంత కాలంగా నివసిస్తున్నారు. ఆ దంపతులకు శునకాలంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో రెండు పెంపుడు శునకాలను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిని సరదాగా రోడ్డుపై తిప్పుతారు. ఈ సందర్భంగా అవి రోడ్డుపైనే మలాన్ని విసర్జిస్తున్నాయి. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో తాజాగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాకీ స్టిక్‌తో దంపతుల ఇంటిపై దాడి చేశారు. ఈ అనూహ్య ఘటనతో ఆ భార్యభర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆ దంపతులు.. దాడి నేపథ్యంలో సహాయం కోసం జర్మనీ ఎంబసీ, పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. అంతేకాకుండా.. తమ పెంపుడు శునకాలు రోడ్డుపై మల విసర్జన చేస్తే ఎప్పటికప్పుడు అక్కడ శుభ్రం చేస్తున్నట్టు వెల్లడించారు. అయినా స్థానికులు తమపై దాడికి యత్నించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అవడంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


Updated Date - 2022-07-04T19:45:20+05:30 IST