హస్తినాపురంలో వైద్యం వికటించి రోగి మృతి

ABN , First Publish Date - 2021-04-09T20:58:11+05:30 IST

హస్తినాపురంలోని నవీన హాస్పిటల్‌లో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా

హస్తినాపురంలో వైద్యం వికటించి రోగి మృతి

హైదరాబాద్: హస్తినాపురంలోని నవీన హాస్పిటల్‌లో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యం వికటించి బాలు అనే వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర తలనొప్పితో నవీన హాస్పిటల్‌‌కు బాలు వచ్చాడు. బాలు తలలో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి వైద్యులు ఆపరేషన్ చేశారు.  అయితే ఆపరేషన్ జరిగిన కొద్ది సేపటికే బాలు మృతి చెందాడు. ఆసుపత్రి ఖర్చుల కింద 2 లక్షల రూపాయలు బిల్ కడితేనే మృతదేహాన్ని ఇస్తామని  బాలు కుటుంబసభ్యలకు హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. దీంతో మృతుడి బంధువులు  హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. 

Updated Date - 2021-04-09T20:58:11+05:30 IST