అప్పుల బాధతో పాఠశాల కరస్పాండెంట్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-09T05:22:34+05:30 IST

పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ కరస్పాండెంట్‌ విజయ్‌ కు మార్‌ (43) సోమవారం అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో  పాఠశాల కరస్పాండెంట్‌ ఆత్మహత్య
విజయ్‌కుమార్‌ (ఫైల్‌)


ధర్మవరం, ఆగస్టు 8: పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ కరస్పాండెంట్‌ విజయ్‌ కు మార్‌ (43) సోమవారం  అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజ య కుమార్‌ ధర్మవరం బ్రాహ్మణవీధిలో శ్రీసాయి ఇంగ్లీషుమీడియం స్కూల్‌ నిర్వహిస్తు న్నాడు. కొవిడ్‌ సమయంలో రెండేళ్లపాటు పాఠశాల జరగక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో విజయ్‌కుమార్‌ భార్య లక్ష్మీ ప్రసన్న భర్తకు ఆసరగా ఉండేందుకు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం తన భార్యను ఉద్యోగం చేసే కంపెనీ వద్ద వదిలిపెట్టి స్కూల్‌కు వెళ్లాడు. అనంతరం ఇంటికి వెళ్లి, మేడపై ఉరివే సుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి, ఆత్మహత్యకుగల కారణాలను తెలుసుకున్నారు. విజయ్‌ కుమార్‌ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కుమారుడు ఉదయ్‌సాత్విక్‌ ఉన్నాడు.


Updated Date - 2022-08-09T05:22:34+05:30 IST