ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
ABN , First Publish Date - 2020-09-17T21:44:53+05:30 IST
ఐఎంఎస్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
హైదరాబాద్: ఐఎంఎస్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. పీఎంజేలో రూ. 7 కోట్లకుపైగా విలువచేసే బంగారం కొనుగోలు చేసినట్లు తేలింది. బంజారాహిల్స్ పీఎంజే జ్యూవెలర్స్ యజమానుల స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. బంగారం కొనుగోలుకు సంబంధించి దేవికారాణి వద్ద కొన్ని ఆధారాలు దొరికాయి. దాని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. అయితే ఇది తమ బంధువులకు సంబంధించిన డబ్బుతో బంగారం కొనుగోలు చేశామని గురుమూర్తి స్టేట్మెంట్లో పేర్కొన్నారు.