Imran Khan భార్య స్నేహితురాలు దుబాయ్‌కు పరారీ

ABN , First Publish Date - 2022-04-06T13:17:22+05:30 IST

పాకిస్థాన్ దేశంలో రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫరాఖాన్ పాకిస్థాన్ దేశం నుంచి దుబాయ్‌కు పారిపోయారు....

Imran Khan భార్య స్నేహితురాలు దుబాయ్‌కు పరారీ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశంలో రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫరాఖాన్ పాకిస్థాన్ దేశం నుంచి దుబాయ్‌కు పారిపోయారు.ఫరాఖాన్ దుబాయ్ దేశానికి పారిపోతూ 90వేల డాలర్ల బ్యాగుతో విమానంలో కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రాబీబీ స్నేహితురాలైన ఫరాఖాన్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ సర్కారు కుప్పకూలిన నేపథ్యంలో ఫరాఖాన్ ను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె దుబాయ్ దేశానికి పారిపోయారని సమాచారం. పంజాబ్ లోని సివిల్ సర్వెంట్ల ద్వారా ఫరాఖాన్ భారీ మొత్తంలో డబ్బు కూడబెట్టారని పీఎంఎల్ ఎన్ నాయకుడు, మాజీ ఆర్థికశాఖ మంత్రి మిప్తా ఇస్మాయిల్ చెప్పారు.


ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేసిన రోజునే ఫరాఖాన్ ఏప్రిల్ 3వతేదీన దుబాయ్ చేరుకున్నారని, ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారని పాక్ నివేదికలు తెలిపాయి.ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని అరెస్టు చేస్తారనే భయంతో ఆమె స్నేహితురాలు దేశం విడిచి పారిపోయిందని పీటీఐ నేత అలీమ్ ఖాన్ గతంలో ఆరోపించారు.ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నివాసంతో నేరుగా సంబంధాలున్న ఫరాఖాన్ అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో డబ్బు తీసుకున్నారని సమాచారం. బదిలీల వ్యవహారాల్లో ఫరాఖాన్ 6 బిలియన్ రూపాయల డబ్బు తీసుకున్నారని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. మొత్తంమీద ఫరాఖాన్ దుబాయ్ కు పారిపోయారనే వార్త పాకిస్థాన్ దేశంలో సంచలనం రేకెత్తించింది.


Updated Date - 2022-04-06T13:17:22+05:30 IST