‘కరోనా’ లక్షణాలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం
ABN , First Publish Date - 2020-04-10T10:44:40+05:30 IST
కరోనా వైరస్ లక్షణాలతో ఎన్టీఆర్ వైద్యాలయానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్ జిల్లా
ఎన్టీఆర్ వైద్యాలయం సిబ్బంది డీసీహెచ్ఎస్ నాయక్ సూచన
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ లక్షణాలతో ఎన్టీఆర్ వైద్యాలయానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.కె. నాయక్ సూచించారు. గురువారం ఇక్కడి వైద్యాలయంలో వైద్యులు, సిబ్బందితో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. వైద్యం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వైద్య విధానపరిషత్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. పీపీఈలు 324 ఉన్నట్టు చెప్పారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్కుమార్, ఆర్ఎంవో సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.