‘కరోనా’ లక్షణాలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2020-04-10T10:44:40+05:30 IST

కరోనా వైరస్‌ లక్షణాలతో ఎన్టీఆర్‌ వైద్యాలయానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్‌ జిల్లా

‘కరోనా’ లక్షణాలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం

ఎన్టీఆర్‌ వైద్యాలయం సిబ్బంది  డీసీహెచ్‌ఎస్‌ నాయక్‌ సూచన


అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 9 : కరోనా వైరస్‌ లక్షణాలతో ఎన్టీఆర్‌ వైద్యాలయానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.కె. నాయక్‌ సూచించారు. గురువారం ఇక్కడి వైద్యాలయంలో వైద్యులు, సిబ్బందితో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. వైద్యం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.


అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వైద్య విధానపరిషత్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు.  పీపీఈలు 324 ఉన్నట్టు చెప్పారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఎంవో సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-10T10:44:40+05:30 IST