నాడు-నేడుతో మెరుగైన సౌకర్యాలు

ABN , First Publish Date - 2020-07-10T10:35:29+05:30 IST

రాయచోటి నియోజవర్గంలో నాడు-నేడు కింద 126 ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు

నాడు-నేడుతో మెరుగైన సౌకర్యాలు

సంబేపల్లె, జూలై 9:  రాయచోటి నియోజవర్గంలో నాడు-నేడు కింద 126 ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా  అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు రాయచోటి ఎమ్మె ల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి  తెలిపారు. గురువారం సంబేపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  నాబార్డు కింద రూ.కోటి 13లక్షల తో భవనాల నిర్మాణం కోసం శంకుస్ధాపన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నాడు-నేడు  కింద 23 పాఠశాలలో ఎంపిక చేసినట్లు  తెలియజేశా రు. కార్యక్రమంలో  మాజీ  డీసీఎంఎస్‌  చైర్మెన్‌ ఆవుల విఘ్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు  శ్రీనివాసరాజు, సంబేపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు  నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:35:29+05:30 IST