కంటైన్మెంట్‌ జోన్‌లలో పారిశుధ్యం మెరుగుపరచాలి

ABN , First Publish Date - 2020-07-07T10:57:02+05:30 IST

మండలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పారిశుధ్యం మెరుగుపరచాలని జనసేన నాయకులు అధికారులను కోరారు.

కంటైన్మెంట్‌ జోన్‌లలో పారిశుధ్యం మెరుగుపరచాలి

వీరవాసరం, జూలై 6 : మండలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పారిశుధ్యం మెరుగుపరచాలని జనసేన నాయకులు అధికారులను కోరారు. ఎంపీడీవో జి.స్వాతికి సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామస్థాయిలో పారిశుధ్యంపై అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటి వరకు ఐదుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. గుండా రామకృష్ణ, పిసిని సంతోష్‌, కేవీఎం.నరసింహారావు, తదితరులు వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - 2020-07-07T10:57:02+05:30 IST