లాక్డౌన్ సందర్భంగా విజయ్ మాల్యా ట్వీట్
ABN , First Publish Date - 2020-03-31T13:09:59+05:30 IST
బ్యాంకులను మోసగించి విదేశంలో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు.....
లండన్ : బ్యాంకులను మోసగించి విదేశంలో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు. విదేశంలో దాక్కున్న విజయ్ మాల్యా ఎప్పటికప్పుడు భారత దేశంతో ‘టచ్’లోనే ఉంటూ ట్వీట్లు చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంటివద్దనే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని విజయ్ మాల్యా సూచించారు. లాక్డౌన్ వేళ పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఇంటి సమయాన్ని ఆస్వాదించండి అంటూ ఆయన కోరారు. తాను కూడా పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నానని విజయ్ మాల్యా చెప్పారు. పుల్వామా, కార్గిల్లో లాగా కాకుండా తెలియని శత్రువు అయిన కరోనా వైరస్తో చేస్తున్న పోరాటంలో అందరూ ధైర్యంగా ఉండాలని విజయ్ మాల్యా కోరారు.