ముఖ్యమైన పుస్తకం మరచిపోయారు!
ABN , First Publish Date - 2020-08-03T06:01:44+05:30 IST
సామిడి జగన్ రెడ్డి గారు ‘హైదరాబాద్ విలీనం నేప థ్యంలో ఇంటిగ్రేషన్ లిటరేచర్ అనే తన వ్యాసంలో (వివిధ, 13 జూలై 2020) పేర్కొనడం మరిచిపోయిన అతి ముఖ్య మైన...
సామిడి జగన్ రెడ్డి గారు ‘హైదరాబాద్ విలీనం నేప థ్యంలో ఇంటిగ్రేషన్ లిటరేచర్ అనే తన వ్యాసంలో (వివిధ, 13 జూలై 2020) పేర్కొనడం మరిచిపోయిన అతి ముఖ్య మైన ఒక పుస్తకాన్ని గుర్తు చేయడం అవసరమనిపించింది. అది మొహమ్మద్ హైదర్ రచించిన ‘అక్టోబర్ కూప్’ అనే ఆత్మకథ. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో హైదర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి. 1948 సెప్టెంబర్ 17 సంఘటన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం అధికారి తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పు కున్న గాథే ఈ పుస్తకం. భారత సైన్యం దాడి అనంతరం జరిగిన మారణహోమం, తదనంతరం ఆంధ్ర పాలకులు సృష్టించిన మత ఘర్షణలు హైదరాబాద్ ముస్లింలను ఎలాంటి భయానక స్థితి లోనికి నెట్టివేసిందో ఈ పుస్తకం వివరిస్తుంది. దీనిని గీతా రామస్వామి 1948 హైదరాబాద్ పతనం పేరుతో అనువదించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తరఫున ప్రకటించారు. ఈ పుస్తకం ప్రస్తావన లేకుండా ఇంటిగ్రేషన్ లిటరేచర్ అనే వ్యాసం నెలలు నిండని గర్భం లాంటిది.
కోడిహళ్లి మురళీమోహన్