ఎన్నికల హామీ అమలు
ABN , First Publish Date - 2020-05-19T06:53:39+05:30 IST
ఎన్నికల హామీల్లో భాగమైన నవరత్నాలను సీఎం జగన్మోహనరెడ్డి పూర్తిస్థాయిలో అమలు
ఎమ్మెల్యే దొరబాబు
పొన్నాడ (కొత్తపల్లి), మే 18: ఎన్నికల హామీల్లో భాగమైన నవరత్నాలను సీఎం జగన్మోహనరెడ్డి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. పొన్నాడ శివారు మచ్చావారి పాకల్లో స్థలాల కేటాయింపుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడూతూ సీఎం జగన్ నవరత్నాల్లో 8 పథకాలను ఇప్పటికే అమలు చేశారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరుతో తొమ్మిదో నవరత్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎల్.శివకుమార్, వైసీపీ నాయకులు రావు, చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, వెంగళి సుబ్బారావు, మాజీ సర్పంచ్ కారే శ్రీనివాసరావు పాల్గొన్నారు.