దళితులపై బీజేపీకి ప్రేముంటే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2022-01-23T04:13:51+05:30 IST
దళితులపై బీజేపీకి ప్రేముంటే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి: మంత్రి హరీష్రావు
హైదరాబాద్: మార్చి 31లోగా అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని మంత్రి హరీష్రావు అన్నారు. దళితులపై బీజేపీకి ప్రేముంటే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలని మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు. దళితులపై బీజేపీ వివక్ష చూపుతోందని, ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని హరీష్రావు విమర్శించారు.