లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయండి
ABN , First Publish Date - 2020-03-31T09:30:21+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం ఇక్కడ
మాడుగుల: కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో మండల అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో పండే కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులు ఇబ్బంది పడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. మాడుగుల సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.