టీడీపీ సంస్థాగత నిర్మాణంలో నూతన విధానం అమలు
ABN , First Publish Date - 2020-09-27T01:58:33+05:30 IST
టీడీపీ సంస్థాగత నిర్మాణంలో నూతన విధానం అమలుకానుంది. ఆదివారం టీడీపీ జిల్లా కమిటీల ప్రకటించనున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు
అమరావతి: టీడీపీ సంస్థాగత నిర్మాణంలో నూతన విధానం అమలుకానుంది. ఆదివారం టీడీపీ జిల్లా కమిటీలను ప్రకటించనున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించనున్నారు. రేపు ఉదయం 11.50 గంటలకు కమిటీపై ప్రకటన చేస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు పార్టీకి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలు వస్తున్నాయి. ఒక పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా పార్టీ కమిటీ ఉంటే, దాని పరిధిలో రాజకీయ కార్యకలాపాల నిర్వహణ, పార్టీ వ్యూహ రచన తేలిగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. జిల్లా స్థాయిలో సీనియర్లతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాల నిర్వహణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.