పథకాలను సమర్ధంగా అమలుచేయండి

ABN , First Publish Date - 2021-06-20T05:32:28+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్ధంగా అమలు చేసేలా సిబ్బంది కృషి చేయాలని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిశోర్‌ కోరా రు. శనివారం పలాసలో సిబ్బందితో సమీక్షించారు.

పథకాలను సమర్ధంగా అమలుచేయండి

 పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు కిశోర్‌

పలాస: ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్ధంగా అమలు చేసేలా సిబ్బంది కృషి చేయాలని పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.కిశోర్‌ కోరా రు. శనివారం పలాసలో సిబ్బందితో సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బహు వార్షిక పశుగ్రాసం పెంపకం, పశుగ్రాస సరఫరా, వైఎస్‌ఆర్‌ చే యూత ద్వారా పాడిపశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేయడం వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఉపసంచాలకుడు ఎ.ఈశ్వరరావు, టెక్కలి ఉపసంచాలకుడు వి.జయరాజ్‌, ప్రాంతీయ పశువైద్యశాల ఉప సంచాలకుడు పోతనపల్లి చంద్రశేఖరరావు  పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-20T05:32:28+05:30 IST