ఇమ్యూనిటీ పెంచే పానీయం!
ABN , First Publish Date - 2020-06-02T05:30:00+05:30 IST
శరీర శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే అందుకు తోడ్పడే పానీయాన్ని ప్రతిరోజూ సేవించాలని ఆయుర్వేదం చెబుతోంది. వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆ పానీయం ఎలా తయారుచేయాలంటే...
శరీర శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే అందుకు తోడ్పడే పానీయాన్ని ప్రతిరోజూ సేవించాలని ఆయుర్వేదం చెబుతోంది. వ్యాధినిరోధకశక్తిని పెంచే ఆ పానీయం ఎలా తయారుచేయాలంటే...
- కావలసిన పదార్థాలు: పది బాదం గింజలను నానబెట్టి, పొట్టు తీసి పెట్టుకోవాలి. 5 ఖర్జూరాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి విత్తనాలు తీసి ఉంచుకోవాలి. ఒక కప్పు ఆవు పాలు దగ్గర పెట్టుకోవాలి. అర టీస్పూను పసుపు, అంతే పరిమాణంలో యాలకుల పొడి, నెయ్యి, తేనె చెరొక టీస్పూను దగ్గర పెట్టుకోవాలి.
- తయారీ విధానం: బాదం, ఖర్జూరం, పసుపు, యాలకుల పొడి, నెయ్యి బ్లెండర్లో వేసి తిప్పాలి. ఇలా రెండు, మూడు సార్లు మిశ్రమం బాగా కలిసేవరకూ తిప్పి, గ్లాసులో నింపాలి. తేనె కలిపి సేవించాలి.