కదలని యాజమాన్యం...విద్యార్థుల్లో చైతన్యం

ABN , First Publish Date - 2022-01-28T05:57:38+05:30 IST

ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల యాజమాన్యం మరుగుదొడ్లను శుభ్రపరచకుండా నిర్లక్ష్యం చేసి నా...విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ముందుకు కదలి గురువారం వాటిని శుభ్రం చేసుకున్నారు.

కదలని యాజమాన్యం...విద్యార్థుల్లో చైతన్యం
శుభ్రం చేస్తున్న విద్యార్థులు


అనంతపురం విద్య, జనవరి 27 : ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల యాజమాన్యం మరుగుదొడ్లను శుభ్రపరచకుండా నిర్లక్ష్యం చేసి నా...విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ముందుకు కదలి గురువారం వాటిని శుభ్రం చేసుకున్నారు.  కళాశాలలలోని టా యిలెట్లను శుభ్రపరచాలని కొన్ని నెలలుగా విద్యార్థులు కోరుతు న్నా...కళాశాల యాజమాన్యం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ  నాయకులు, పలువు రు విద్యార్థులు కలసి టాయిలెట్ల ను, ఆ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. తోటి విద్యార్థుల ఆరో గ్యం బాగుండాలన్న సృహతో... టాయిలెట్లను నీళ్లతో కడగడంతో పాటు,  బ్లీచింగ్‌ చల్లి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో  అశోక్‌కు మార్‌, నవీన్‌కుమార్‌, అజయ్‌ కుమార్‌, అబ్దుల్‌ రెహమాన్‌ బ్రహ్మ, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-28T05:57:38+05:30 IST