అమర వీరుల కుటుంబాలకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-20T05:02:11+05:30 IST

అమర వీరుల కుటుంబాలకు అండగా ఉండాలి

అమర వీరుల కుటుంబాలకు అండగా ఉండాలి
పోటీలను ప్రారంభిస్తున్న సీఐ ఉపేందర్‌, ఎంపీపీ, జడ్పీటీసీ

ఆమనగల్లు: ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీసు అమర వీరుల కుటంబాలకు ప్రజలంతా అండగా ఉండాలని సీఐ జె.ఉపేందర్‌, ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధపత్యానాయక్‌ అ న్నారు. 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్‌లో మంగళవారం షాద్‌నగర్‌ డివిజన్‌స్థాయి బాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. 36జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. 21న బహుమతుల ప్రదానం ఉంటుందని సీఐ తెలిపారు. క్రీడలు శారీర దారుఢ్యానికి, మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, తహసీల్దార్‌ పాండునాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, ఎస్సైలు ధర్మేష్‌ వరప్రసాద్‌, హరిశంకర్‌గౌడ్‌, ఏఎ్‌సఐలు నిరంజన్‌, సీతారాంరెడ్డి, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, జోగు వీరయ్య, ఎ.శ్రీను, కృష్ణానాయక్‌, వెంకటేష్‌, పత్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:02:11+05:30 IST