IMF chief క్రిస్టాలినా జార్జివాకు కరోనా
ABN , First Publish Date - 2022-04-29T13:30:38+05:30 IST
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కరోనా బారిన పడ్డారు...
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కరోనా బారిన పడ్డారు.క్రిస్టాలినా జార్జివాకు జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. క్రిస్టాలినాకు తేలికపాటి కరోనా లక్షణాలుండటంతో ఆమె ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి ఆన్లైన్లో పనిచేస్తున్నారని వాషింగ్టన్కు చెందిన ప్రతినిధి గెర్రీ రైస్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సోకిన ప్రముఖుల జాబితాలో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా చేరారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తో పాటు పలువురు సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది.క్రిస్టాలినా కొవిడ్ వ్యాక్సిన్ మూడు డోసులు వేయించుకున్నా, ఆమెకు కరోనా సోకిందని వైద్యులు చెప్పారు.