మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-01-04T21:52:37+05:30 IST
జిల్లాలోని కదిరిపురం తండాలోని గిరిజన పాఠశాలలో
కర్నూలు: జిల్లాలోని కదిరిపురం తండాలోని గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. దీంతో చికిత్స కోసం వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.