హనుమకొండ జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-02-26T20:50:51+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

హనుమకొండ జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

హనుమకొండ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన  కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో జరిగింది. శ్రీరాములపల్లి ప్రభుత్వ పాఠశాలలోని 70 మంది విద్యార్థులు భోజనం తినగా 30 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురయిన విద్యార్థులను శ్రీరాములపల్లె పాఠశాల నుంచి 108 ద్వారా స్థానిక కమలాపూర్  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-02-26T20:50:51+05:30 IST