హనుమకొండ జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-02-26T20:50:51+05:30 IST
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
హనుమకొండ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో జరిగింది. శ్రీరాములపల్లి ప్రభుత్వ పాఠశాలలోని 70 మంది విద్యార్థులు భోజనం తినగా 30 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురయిన విద్యార్థులను శ్రీరాములపల్లె పాఠశాల నుంచి 108 ద్వారా స్థానిక కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.