‘ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి’

ABN , First Publish Date - 2020-11-01T08:53:50+05:30 IST

గతంలో కూల్చివేసిన ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాచుపల్లి తహసీల్దార్‌ భూపాల్‌కు నిజాంపేట్‌ బీజేపీ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు

‘ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి’

నిజాంపేట్‌, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): గతంలో కూల్చివేసిన ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాచుపల్లి తహసీల్దార్‌ భూపాల్‌కు నిజాంపేట్‌ బీజేపీ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. అప్పటి తహసీల్దార్‌ నిర్మల అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, ప్రభుత్వ స్థలమనే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ అదే స్థలంలో రెండు రోజుల నుంచి నిర్మాణాలు చేపడుతున్నారని వాటిని అడ్డుకోవాలని పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో బీజేపీ నాయకులు ఆకుల సతీష్‌, ఆమలేశ్వరి, సుమన్‌రావు, నరేంద్ర చౌదరి, సుహాసిని శక్తి, కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. 

Updated Date - 2020-11-01T08:53:50+05:30 IST