అక్రమ సంబంధం... అందులో అనుమానం... చివరికి హత్య

ABN , First Publish Date - 2020-08-07T00:24:03+05:30 IST

చేసిందే తప్పు పని. అందులో మళ్లీ అనుమానం ఒకటి. ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న వివాహేతర సంబంధంలో కూడా అనుమానించాడు. ఆ అనుమానమే పెనుభూతమై ఏకంగా ఓ మహిళ ప్రాణాలు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో దుర్ఘటన జరిగింది.

అక్రమ సంబంధం... అందులో అనుమానం... చివరికి హత్య

ఉంగుటూరు : చేసిందే తప్పు పని. అందులో మళ్లీ అనుమానం ఒకటి. ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న వివాహేతర సంబంధంలో కూడా అనుమానించాడు. ఆ అనుమానమే పెనుభూతమై ఏకంగా ఓ మహిళ ప్రాణాలు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో దుర్ఘటన జరిగింది. 


తాడేపల్లిగూడేనికి చెందిన రామలక్ష్మి భర్తతో విడిపోయింది. బిడ్డతో కలిసి ఉంగుటూరులో నివసిస్తోంది. ఈ క్రమంలో... ఇంటి పక్కనే ఉంటున్న సూర్యారావు అనే వ్యక్తితో ఆమెకు అనుబంమేర్పడింది. మూడేళ్లుగా వీళ్లు తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.


అయితే తనతో అక్రమ సంబంధంలో ఉన్న రామలక్ష్మి... మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందని సూర్యారావు అనుమానించాడు. రోజురోజుకు ఆ అనుమానం బలపడింది. ఈ క్రమంలో... రామలక్ష్మిని చంపివేయాలని నిర్ణయించుకున్నాడు.


ఈ క్రమంలోనే... ఆమెను తీసుకొని సమీపంలోకి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడే ఆమెను గొంతునులిమి చంపివేశాడు. అంతేకాదు... తను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు... పోలీసులకు సమాచారమందించారు. సూర్యారావును ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు... రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. 

Updated Date - 2020-08-07T00:24:03+05:30 IST