ఆవరాజాంలో అక్రమంగా మట్టి తవ్వకాలు
ABN , First Publish Date - 2021-06-23T05:59:08+05:30 IST
ఆవరాజాం పంచాయతీ పరిధిలోని ఉర చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
అడ్డుకున్న సర్పంచ్పై దాడికి యత్నం
అచ్యుతాపురం, జూన్ 22: ఆవరాజాం పంచాయతీ పరిధిలోని ఉర చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు మూడు రోజులుగా భారీగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారు. ఎక్సవేటర్ సహాయంతో తవ్వకాలు చేసి లారీల ద్వారా ఇతరుల భవనాల పునాదులు కప్పటానికి తరలిస్తున్నారు. కాగా, తాను చెరువులోకి వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నానని సర్పంచ్ నానాజీ తెలిపారు. అంతేకాక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అలాగే వైసీపీ నాయకులు తన ఇంటికి వచ్చి బెదిరించారని ఆయన తెలిపారు. జగనన్న ఇళ్ల పేరు చెప్పి వైసీపీ నాయకులు మట్టిని ఇతరులకు విక్రయించేస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపితే విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.