టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు: పీతల సుజాత
ABN , First Publish Date - 2021-01-21T20:58:15+05:30 IST
రాష్ట్రంలోని టీడీపై నాయకులను జగన్ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత
ఏలూరు: రాష్ట్రంలోని టీడీపీపై నాయకులను జగన్ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. గురువారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు దోషులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రామతీర్థం ఘటనలో అసలు దోషులను వదిలేశారని ఆమె పేర్కొన్నారు. టీడీపీకి చెందిన కళా వెంకట్రావు లాంటి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని సుజాత విమర్శంచారు. టీడీపీ నాయకులపై దాడులు చేయడం, కేసులు పెట్టే బదులు అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ కు ఆమె సూచించారు.