పేదల సొమ్ము దోచుకున్న అచ్చెన్నాయుడుది అక్రమ అరెస్టా?: మేరుగ నాగార్జున

ABN , First Publish Date - 2020-07-05T01:24:37+05:30 IST

పేదల సొమ్ము దోచుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుది అక్రమ అరెస్టా? అని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మర్డర్ చేయించిన

పేదల సొమ్ము దోచుకున్న అచ్చెన్నాయుడుది అక్రమ అరెస్టా?: మేరుగ నాగార్జున

గుంటూరు: పేదల సొమ్ము దోచుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుది అక్రమ అరెస్టా? అని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. మర్డర్ చేయించిన టీడీపీ నేత కొల్లు రవీంద్ర అమాయకుడా అని నిలదీశారు. సీఎం జగన్‌ను ఆనాడు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మాజీ సీఎం చంద్రబాబు కళ్లు పోయాయా? అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో అనుచరులకు దోచిపెట్టి దళితుల కడుపు కొట్టారని, ఆయనకు దళితుల ఉసురు తగులుతుందని మేరుగ నాగార్జున హెచ్చరించారు.

Updated Date - 2020-07-05T01:24:37+05:30 IST