అక్రమ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2020-10-01T07:49:26+05:30 IST
మండలంలోని రఘుదేవపురంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను సీతానగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ
సీతానగరం, సెప్టెంబరు 30: మండలంలోని రఘుదేవపురంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను సీతానగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సుధాకర్ వివరాల ప్రకారం... తెలంగాణకు చెందిన 46 మద్యం సీసాలను మద్దుకూరి వంశీ రఘుదేవపురంలో తన ఇంటి నుంచి షేక్బాబ్జి తీసుకొస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడిని విచారించగా తెలంగాణ నుంచి విలేకరుల ముసుగులో చెన్నా దుర్గాప్రసాద్, చందులు తెలంగాణ నుంచి మద్యం సీసాలు తెచ్చి వంశీ ఇంటిలో ఉంచి అమ్మకాలు జరుపుతున్నారని తెలిసింది. మిగిలిన ముగ్గురుపైనా కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు. బాబ్జిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు ఆయన తెలిపారు.