తనతోపాటు వేరే వ్యక్తితో కూడా ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో..

ABN , First Publish Date - 2020-08-08T14:16:48+05:30 IST

ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడు. పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ భర్త వదిలేయడంతో

తనతోపాటు వేరే వ్యక్తితో కూడా ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో..

పేట్‌బషీరాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడు. పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి బతుకుదెరువు కోసం వలస వచ్చి కుత్బుల్లాపూర్‌ భాగ్యలక్ష్మి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న భవనం వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెతోపాటు కూలి పనిచేసే చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన కృష్ణతో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి అతడు మహిళతో గడిపేవాడు. అదే ప్రాంతంలో ఉంటున్న ప్రకాశం జిల్లా, కందుకూరుకు చెందిన కె. మాధవరావు అక్కడే మేస్త్రిగా పనిచేస్తున్నాడు. 


గురువారం మహిళ తల్లిదండ్రులు ఊరికి వెళ్లారని తెలుసుకున్న కృష్ణ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేదు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లావని అడగగా.. మాధవరావుకు మంచినీళ్లు ఇచ్చి వస్తున్నానని కృష్ణతో చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానంతో కృష్ణ మాధవరావు వద్దకు వెళ్లి అతడిపై దాడిచేసి ముక్కుపై పిడిగుద్దులు గుద్ది పారిపోయాడు. అందరూ నిద్రపోయిన తర్వాత కత్తి తీసుకెళ్లి మాధవరావును పొడిచాడు. అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా చనిపోయి ఉన్నాడు. స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-08T14:16:48+05:30 IST